ముంబై : కొవిడ్-19 వ్యాక్సిన్లను కోటికి పైగా ఇచ్చిన మొదటి జిల్లాగా ముంబై (Vaccines at Mumbai) అవతరించింది. ఈ విషయాన్ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. కోవిన్ పోర్టల్లో ప్రచురించబడిన డాటా ప్రకారం, ముంబైలో శుక్రవారం వరకు మొత్తం 1,00,60,411 కోట్ల వ్యాక్సిన్ డోస్లను అందజేశారు. యువకుల జనాభాలో 78 శాతం మంది కనీసం ఒక్క డోస్ తీసుకున్న వారు ఉన్నారు.
ముంబైలో 72.74 లక్షల మందికి మొదటి డోస్, రెండు డోస్లు తీసుకున్నవారు 27.86 లక్షల మంది ఉన్నారు. గత 24 గంటల్లో ముంబై నగరంలో 416 కొత్త కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదవగా, నలుగురు మరణించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాజా కేసులతో రాజధాని నగరంలో సంఖ్య మొత్తం 7,45,850 కు చేరుకున్నది.
ముంబై నగరంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 15,991 కి చేరింది. నగరంలో ప్రస్తుతం 3,561 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 36,546 నమూనాలను పరిశీలించడంతో.. ముంబైలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 93,89,842 కు చేరుకున్నది. కరోనా వైరస్ రోగులు గుర్తించిన అనంతరం 46 భవనాలను సీలు చేశారు. శనివారం మొత్తం 382 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా శనివారం 11.91 లక్షల మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందించారు. రాష్ట్రంలో ఒకే రోజు టీకాలు వేయడంలో సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 టీకా సంఖ్య 6.27 కోట్లకు చేరింది.
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
బంగారు వడ పావ్ కావాలా? ఎక్కడ దొరుకుతుందంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..