రాయ్పూర్ : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్పై (Nand Kumar Baghel) రాయ్పూర్లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని అక్కడి ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై తప్పుడు మాటలు మాట్లాడారంటూ సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు రాయ్పూర్లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(B) కింద కేసు నమోదు చేసినట్లు రాయ్పూర్ పోలీసులు తెలిపారు.
బ్రాహ్మణులను విదేశీయులుగా పేర్కొంటూ.. వారిని బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తండ్రి నంద్ కుమార్ బాఘేల్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారని, వారిని తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలను కోరినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొన్నది. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ బాఘేల్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. సీఎం తండ్రి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్నదని సంస్థ పోలీసులకు తెలిపింది. తక్షణమే ఆయనపై చర్చలు తీసుకోవాలని విజ్ఞప్తిచేసింది. దాంతో ఆయనపై.. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని, ప్రజలు భయపడాలన్న ఉద్దేశంతో ప్రశాంతతకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్మశానంగా మార్చినా.. ఈ స్థలాన్ని వదిలిపెట్టం : రాకేశ్ తికాయత్
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
బంగారు వడ పావ్ కావాలా? ఎక్కడ దొరుకుతుందంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..