దుష్ప్రచారమని ఆరోపణహైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : హైడ్రా వ్యవస్థపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో జరిగిన అసెంబ్లీ రూల్స్, ఎథిక్స్, అసెంబ్లీ హామీల అమలు కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు.
హైడ్రాకు సంబంధించి పూర్తిస్థాయి తీర్పు ఇంకా వెలువడలేదని, తుది తీర్పు వచ్చాక ప్రభుత్వ వైఖరిని చట్టపరంగా స్పష్టంచేస్తామని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైడ్రా వల్ల నష్టం లేదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో విజయవంతంగా పనిచేస్తున్నదని చెప్పారు. హైడ్రాపై వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేస్తున్నది బీఆర్ఎస్, బీజేపీ నేతలేనని, రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.