ఇండోర్: మధ్యప్రదేశ్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు ఎమ్మెల్యే సుపుత్రుడు. బాధిత యువతి ఫిర్యాదుతో ఇండోర్ పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు. ఉజ్జయిని జిల్లా బంద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ మొర్వాలి కుమారుడు కరన్ మొర్వాలి. అతను జిల్లా కాంగ్రెస్ యూత్ లీడర్గా పనిచేస్తున్నాడు. బాధితురాలు కూడా అదే యువజన కాంగ్రెస్ నాయకురాలు కావడం విశేషం.
గత ఏడాది డిసెంబర్ తాము కలిశామని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఇండోర్ పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. నగరంలోని ఓ హోటల్కు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడి పాల్పడ్డాడని వెల్లడించింది. దీంతో ఎమ్మెల్యే మురళి, అతని కుమారుడు కరన్పై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి జ్యోతి శర్మ వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..