గద్వాల అర్బన్, మే5: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి బుధవారం కొవిడ్ రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ 45ఏండ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేతోపాటు సింగిల్ విండో చైర్మన్ సుభాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీటీసీ రాజశేఖర్, టీఆర్ఎస్ గద్వాల మండల అధ్యక్షుడు రమేశ్నాయుడు, ఉమ్మడి కేటీఆర్ యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్రెడ్డి కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు.