KCR | ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర నర్సాపూర్ చేరుకుంది. ఇవాళ సాయంత్రం ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్.. గజ్వేల్ మీదుగా నర్సాపూర్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం లభించింది.
గత 15 రోజులోగా దిగ్విజయంగా కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర తమ పట్టణానికి చేరుకోవడంతో గజ్వేల్ వాసులు ఆనందంతో ఆహ్వానం పలికారు. గజ్వేల్ చేరుకున్న మహానేతకు మంగళహారతులతో స్వాగతం పలికారు. గజ్వేల్ మహిళలు విజయ తిలకం దిద్ది బస్సుయాత్రను నర్సాపూర్ దిశగా సాగనంపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినతే కేసీఆర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ, నేతలను పలకరిస్తూ నర్సాపూర్కు బయల్దేరి వెళ్లారు.