సూర్యాపేట : ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు పాపం. ఎంత వేదనను అనుభవించిందో తెలియదు కానీ..ఈ లోకంలో ఉండకూడదని కఠిన నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసి అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే పిల్లలను ఉరితో కడతేర్చి తనూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనాధ్, మౌనిక భార్య భర్తలు. శ్రీనాధ్ ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. కాగా, కుటుంబ కలహాల నేపథ్యంలోనే మౌనిక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రైతు అవతారం ఎత్తి.. విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ