సనత్నగర్/హైదరాబాద్ : రెండు అంతస్తుల భవనంపై నుంచి పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి జింకల వాడలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..బీహార్ రాష్ట్రానికి చెందిన దత్తు కుమార్, పూజా దంపతులకు ఏసురాజ్ (5) అనే కొడుకు ఉన్నాడు. కాగా, భవనంపైన ఆడుకుంటున్న ఏసురాజ్ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి జారీ పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు