సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు తొందలోనే పూర్తిగా నిండే అవకాశముందని ప్రాజెక్టు ఏఈ మజార్ మహ్మద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టిఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 20.438 టిఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 3,325 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 386 క్యూసెక్కులుగా ఉందని ఏఈ తెలిపారు. కాగా, వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహిళలు, యువకులు, చిన్నారులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. సందర్శకుల తాకిడి ఎక్కువయిన సందర్భంగా ప్రాజెక్టు అధికారులు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్