ఢిల్లీ : ప్రయాణంలో ఉన్న రైలు ఎక్కుతుండగా ఓ వ్యక్తి జారి ప్లాట్ఫాంకి, రైలుకి మధ్య ఉన్న గ్యాప్లో పడిపోయాడు. అదృష్టవశాత్తు అక్కడ ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ తక్షణం స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఓ వ్యక్తి రైలు ఎక్కేందుకు ప్లాట్ఫాం పైకి చేరుకున్నాడు. అతని రెండు చేతుల్లో రెండు బ్యాగులు ఉన్నాయి. అప్పటికే రైలు కదిలింది. కదిలే రైలును ఎక్కే క్రమంలో మొదటగా ఓ బ్యాగును భోగీలోకి విసిరాడు. అనంతరం మరో బ్యాగుతో ఎక్కేందుకు ప్రయత్నించాడు. కాగా కాలు ఒక్కసారిగా మడతపడటంతో భోగికి, ప్లాట్ఫాంకి మధ్య ఉన్న సంధులో వ్యక్తి ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రజ్వీర్ సింగ్ గమనించి వెంటనే అతడిని రక్షించాడు. దీంతో సదరు వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.