నాగర్ కర్నూల్ : పారాణి ఆరకముందే ఆ నవ వధువు తనువు చాలించింది. పెండ్లి అయిన ఐదు రోజులకే మృత్యువు ఒడికి చేరుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన శ్రీవాణి(19) ఈ నెల 14న తాండూరు గ్రామానికి చెందిన నవీన్తో ఘనంగా వివాహం జరిపించారు. మంగళవారం భార్యభర్తలు ఇరువురూ గుడిలో అభిషేకం చేసుకుని ఇంటికి చేరారు.
కొద్ది సేపటికి నూతన వధువుకు వాంతులు రావడంతో జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదిలా ఉండగా కరోనా కారణంగానే మృతి చెందినట్టు స్థానికులు పేర్కొంటూ ఉండగా..కుటుంబ సభ్యులు మాత్రం కరోనా రాలేదని చెప్పారు.
ఏదేమైనా పెండ్లి అయిన ఐదు రోజులకే నవ వధువు మృతి చెందడంపై రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి