హత్నూర / సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన హత్నూర మండలం కొత్తగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం..గ్రామానికి చెందిన వనం నర్సింహులు (50) తన ఇంటివద్ద ఉండగా ఇండ్ల మధ్యగల విద్యుత్ వైర్లలో ఒకటి తెగిపడి నర్సింహులు చాతిపై పడటంతో కరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
కాగా, విద్యుత్ వైరు అంతకు ముందు వనం రాములు అనే వ్యక్తి చేతిపై పడగా అతడికి గాయాలయ్యాయి. రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న విద్యుత్వైర్లు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని, వాటిని సరిచేయాలని పలుమార్లు విద్యుత్ అధికారులను కోరినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే నిండుప్రాణం బలయిందని ఆరోపించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు