మహబూబ్నగర్ : పండుగ సంతోషం వారి ఇంట్లో ఎంతో సేపు నిలవలేదు. ఆనందంగా పండుగ జరుపుకొని తండ్రితో కలిసి తిరిగి కాలేజీకి వెళ్తున్నక్రమంలో రోడ్డు ప్రమాదంలో తండ్రీ బిడ్డలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటన జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో NH44 పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వారిని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చౌటగడ్డ తండాకు చెందిన కోటేష్, ఆయన కూతురు మనస్వికి తీవ్రగాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్న మనస్వి పోచమ్మ పండుగకు ఇంటికి వచ్చింది. మంగళవారం తిరిగి గురుకులానికి వెళ్లేందుకు జడ్చర్ల బస్టాండ్ కు స్కూటీపై వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో తండ్రి, కూతురు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి లేరు. హెల్మెట్ లేకపోవడం వల్లే తలకు తీవ్రగాయాలు అయ్యాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు