కంది /సంగారెడ్డి : కుటుంబ కలహాలతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కంది మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన మాల మహేష్ (27)కు శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన శిరీషతో 10 నెలల క్రితం వివాహం జరిగింది. కాగా, మహేష్ తన భార్య శిరీషను ఈనెల 26న సాయంత్రం టంగుటూరు గ్రామంలో తల్లిగారి ఇంటి వద్ద వదిలి కాశీపూర్కు తిరిగి వచ్చాడు.
ఈ నెల 27న ఉదయం తన తల్లితో మహేష్కు సంసారం విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మహేష్ తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం తన భార్య శిరీష ఏడు నెలల గర్భవతి. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం