ఆదిలాబాద్ : నిర్మల్ ఫిష్ మార్కెట్ వద్ద గల వ్యవసాయ కార్యాలయంలో గురువారం జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను దేవాదాయ శాఖ అంల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు. (50 % రాయితీపై బేలర్, గడ్డి కట్టే యంత్రం, రోటావేటర్లు, తైవాన్ పంపులు, పంప్ సెట్లు) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.