నల్లగొండ : జిల్లా నేరెడుగొమ్ము మండలం ఎర్రగట్టు తండాకు చెందిన కొడావత్ రవి(40) మద్యం మత్తులో శానిటైజర్ తాగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు వలస వెళ్లిన రవి గురువారం సాయంత్రం శానిటైజర్లో నీళ్లు కలుపుకొని తాగాడు. ప్రవర్తనలో అనూహ్యమార్పులు రావడంతో భార్య, పిల్లలు గమనించి స్వగ్రామానికి తీసుకొస్తుండగా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో ప్రాథమికి చికిత్స చేయించి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి..
విషాదం : సంప్లో పడి వ్యక్తి మృతి
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన