హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బ ందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం పత్తి కొ నుగోలు ఏర్పాట్లపై సీసీఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పంట పండించిన రైతులకు మారెటింగ్లో ఎకడా ఇబ్బందులు కలుగకూడదని, ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థలకు చెడ్డపేరు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 2026-27 సీజన్ లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నదని, సుమారు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశమున్నదని మంత్రి తెలిపారు.