వికారాబాద్: జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడు బొంరాస్పేటకు చెందిన గడ్డల బాలు (32)గా గుర్తించారు. శంకర్పల్లి నుంచి కొడంగల్ మండలం లక్ష్మీపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..