న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొన్ని వారాలుగా కేసుల పెరుగుదల భారీగా పెరిగింది. తొలిసారిగా ఈ ఏడాదిలో ఒకే రోజు 7వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో రోగులు హాస్పిటల్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు మహమ్మారి బారినపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్కు చెందిన 37 మంది వైద్యులు కరోనా పాజిటివ్గా తేలారు. మహమ్మారి బారినపడిన వారిలో చాలా మంది వైద్యులు కొవిడ్ టీకా తీసుకున్న వారే ఉన్నారు.
ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మందికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని హాస్పిటల్ అధికారులు చెప్పారు. దీంతో 32 మంది వైద్యులు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో సర్ గంగారామ్ హాస్పిటల్ ముందుంది. ఇదిలా ఉండగా.. గురువారం ఢిల్లీలో రికార్డు స్థాయిలో 7,437 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 మంది వైరస్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న రోజువారీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.