కుమ్రంభీం అసిఫాబాద్ : అసిఫాబాద్ మండలంలోని అడా ఎస్బీఐ బ్యాంక్లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంక్ కిటికీలు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటన స్థలాన్ని అడ్మిన్ ఎస్పీ సుధీంద్ర పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకులో దొంగలు కట్టర్ల సహాయంతో లాకర్లను తొలగించినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు.
ఈ చోరీలో బ్యాంకు లాకర్లో ఉన్న 5 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బ్యాంకులో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం దొంగలు పగలగొట్టినట్లు ఎస్పీ వివరించారు. దుండగులను తొందరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్
Telangana pioneer | ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ అగ్రగామి : మంత్రి ఎర్రబెల్లి