ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామ శివారులో ఈ నెల 2న రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓఎస్డీ శోభన్ కుమార్ ఏటూరునాగారంలో సోమవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
రొయ్యూరు గ్రామానికి చెందిన సంద దుర్గయ్య (30) జేసీబీ డ్రైవర్గా పనిచేస్తూ తన భూ సమస్య పరిష్కారం కోసం మావోయిస్టు అగ్రనేత దామోదర్ను ఇటీవల సంప్రదించినట్టు తెలిపారు.
ఈ క్రమంలో దుర్గయ్య సమస్యను ఆసరగా చేసుకున్న మావోయిస్టులు భూ సమస్యను పరిష్కరిస్తామని దానికోసం వారోత్సవాల సమయంలో మావోయిస్టు పార్టీ చెప్పినట్లు చేయాలని దుర్గయ్యను ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిపారు.
ఈ నెల 2వ తేదీన రోడ్డు పనుల నిమిత్తం రొయ్యూరు గ్రామ శివారులో ఉన్న రోడ్డు రోలర్ను తన వెంట తెచ్చిన పెట్రోల్తో దహనం చేసి దామోదర్ ఇచ్చిన కరపత్రాలను సంఘటన స్థలంలో పడేసినట్లు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న ఏటూరునాగారం పోలీసులు దర్యాప్తు చేసి దుర్గయ్య ను అరెస్ట్ చేసినట్లు శోభన్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
భారత్, రష్యా మధ్య పలు రక్షణరంగ ఒప్పందాలు
చరిత్రలో ఈరోజు : బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 29 ఏండ్లు