నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న హెల్త్ అసిస్టెంట్ బాలామణి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..