నాగర్ కర్నూల్ : ఉన్న ఊరును వదిలి బతుకు దెరువుకు కోసం పట్నం వెళ్లి బతుకు బండిని లాగిద్దామనుకున్నా ఆ భార్యర్తల ఆశల అడియాసలయ్యాయి. కారు రూపంలో ఆ జంటను మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న బైక్ను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన గణపూర్ రోడ్ సిద్దాపూర్ చౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన సూర్యశేఖర్ అతని భార్య లలిత ఇద్దరు బతుకుదెరువు కోసం బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా.. మార్గ మధ్యమంలో బైక్ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు