జగిత్యాల : జిల్లాలోని కథలాపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పౌర సరఫరాల సంస్థ కమిషనర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి నాయక్ను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా తాండ్రియాల్ గ్రామానికి చేరుకున్న వినోద్ కుమార్తో గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ధాన్యం సేకరణ జరగడం లేదని తెలిపారు. వర్షాలు కురుస్తున్నాయి.
ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన వినోద్ కుమార్ పౌర సరఫరాల సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్ లతో ఫోన్లో మాట్లాడారు.
తాండ్రియాల్ గ్రామంలోని 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే సేకరించి జగిత్యాల జిల్లా గోడౌన్ లలో స్థలం లేకుంటే పెద్దపల్లి జిల్లా గోడౌన్ లకు తరలించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్