నిజామాబాద్ : సీఎం కేసీఆర్ కృషితో నిరుపేదలకు ఉచిత వైద్యసదుపాయాలు మరింత చేరువ అవున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రారంభించిన డయాగ్నోస్టిక్ సెంటర్ లు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉచిత డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత వైద్య నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు ఏర్పాటుచేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలు వైద్యం కోసం నాలుగు రకాల ఖర్చులతో ఇబ్బందులకు గురౌతారు. ఇందులో ముఖ్యమైంది వైద్య పరీక్షలకు చేసే ఖర్చు చాలా భారం అవుతుందని తెలిపారు.
ఈ భారం పేదలపై పడకూడదనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో రూ.5 కోట్ల వ్యయంతో ఉచిత డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గతంలో వైద్య పరీక్షలకోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేదన్నారు.
ఇక నుంచి నిరుపేదలకు ఈ భారం తప్పుతుందని వివరించారు. ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి