నిజామాబాద్ : వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. నిమజ్జనం కోసం వాగులో దిగిన ఓ యువకుడు నీళ్లలో మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన బోధన్ మండలం నాగంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దయానంద్ అనే వ్యక్తి నిమజ్జనం కోసం వాగులో దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మృతదేహం కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా..ఆదివారం ఉదయం బయటపడింది. దయానంద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి
Salman Khan: బిగ్ బాస్ షోకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్