రంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. యాచారం మండలంలో వివిధ గ్రామాలలో రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన ప్రకారం..కడ్తాల్ మండలం పల్లెచెల్క తండాకు చెందిన రాజు అనే వ్యక్తి గ్రామాలలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్కళ్లపల్లి గేటు వద్ద ఆటోను పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతు అవతారం ఎత్తి.. విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ