న్యూఢిల్లీ, ఆగస్టు 18: యమహా మోటర్స్ సరికొత్త స్కూటర్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫ్యాస్కినో మాడళ్లలో భాగంగా 2026 ఏడాదికిగాను విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.78,980 ప్రారంభ ధరతో లభించనుండగా..డిస్క్ రకం రూ.91,070గాను, ఫ్యాస్కినో ఎస్ మాడల్ రూ.99,030గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.