ఈ ఏడాది లైగర్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన లైగర్ (Liger) భారీ అంచనాల మధ్య విడుదలై.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫెయిల్యూర్తో కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం శివనిర్వాణ డైరెక్షన్లో నటిస్తున్న ఖుషీ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఖుషీలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇంతకీ ముంబైలో ఏం చేస్తున్నాడనే కదా మీ డౌటు. మెహబూబ్ స్టూడియోస్లో థంబ్స్ అప్ యాడ్ షూటింగ్లో పాల్గొంటున్నాడని ఇన్సైడ్ టాక్. అంతేకాదు విజయ్ హిందీ డైరెక్టర్ను కూడా కలిసి ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించనున్నాడట.
ఈ యాక్టర్ ప్రస్తుతానికైతే సైలెన్స్ ను మెయింటైన్ చేస్తున్నాడు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ త్వరలో సాయి రాజేశ్ దర్శకత్వంలో రాబోతున్న బేబి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన బేబి టీజర్కు మంచి స్పందన వస్తోంది.
ఆనంద్ దేవరకొండ బేబి టీజర్.. వీడియో
Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద
Read Also : Devi Sri Prasad | బాస్ పార్టీ సాంగ్పై ట్రోల్స్.. దేవీ శ్రీ ప్రసాద్ నో కామెంట్స్ !
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?