సినిమాల ఎంపిక విషయంలో కొత్తదనంతో కూడిన కథలను చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు టాలీవుడ్ (Tollywood)యువ హీరో నితిన్ (Nithiin). దక్షిణాదిన తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema) లో ఉన్న యాక్టర్లలో కొంతమంది మాత్రమే డిజిటల్ వరల్డ్ (digital world) లోకి ఎంట్రీ ఇచ్చారు. టాక్ షోలను హోస్టింగ్ చేస్తున్నారు. ఒరిజినల్ సిరీస్లో నటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో నితిన్ కూడా చేరిపోతున్నాడన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
నితిన్ ప్రస్తుతం ఓ వెబ్సిరీస్ లో నటించేందుకు, నిర్మించేందుకు రెడీగా ఉన్నట్టు టాక్. ఓటీటీ ప్రాజెక్టులో నటించేందుకు సరైన కథ కోసం వెతుకుతున్నాడట. తనతో సన్నిహితంగా ఉండే రచయితలు, డైరెక్టర్లు తనకు సరిపోయే కథలను తీసుకొస్తామని నితిన్కు చెప్పారట.
ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే నితిన్ ఓటీటీ ప్రాజెక్టుతో రాబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నట్టే. 2022లో నితిన్ ఓటీటీ ఎంట్రీ (OTT debut) మాత్రం తప్పక ఉంటుందని భావిస్తున్నారు సినీ జనాలు.
ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్పై మెరిసిన నితిన్ రానున్న రోజుల్లో వెబ్ ప్రాజెక్టులతో కూడా ఎంటర్ టైన్ చేయడానికి ఫిక్స్ అయినట్టేనని తాజా అప్డేట్ చెబుతోంది. ప్రస్తుతం ఇంటెన్స్ రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న మాచెర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నాడు నితిన్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్లో మహేశ్బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్కపూర్