పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ సునీత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. తన భర్త రామ్ వీరపనేని ప్రొడక్షన్ హౌజ్ మ్యాంగో మాస్ మీడియా వింగ్ను చూసుకోనుందట సునీత. రామ్ వీరపనేని ఇటీవలే యూత్ఫుల్ ఎంటర్ టైనర్ ఏక్ మినీ కథ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం వెబ్సిరీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు రామ్.
కంటెంట్, ఇతర ప్రొడక్షన్ బాధ్యతలను సునీత పర్యవేక్షించనుందని రామ్ వెల్లడించినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. మరో విషయమేంటంటే సునీత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా వ్యవహరించిన ఐకానిక్ మ్యూజికల్ షో పాడుతా తీయగాకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది. ఒకవేళ సునీత నిర్మాతగా మారుతుందనేది నిజమే అయితే ఆమె ఫాలోవర్లకు గుడ్న్యూస్ అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com