టాలీవుడ్ నటి శ్రియా శరణ్ ఇండియాకు తిరిగొస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఏడాది కాలంగా తన సమయాన్ని గడిపింది శ్రియ. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఏడాది నుంచి తన భర్త ఆండ్రీ కొచీవ్ తో కలిసి స్పెయిన్ లోనే ఉండిపోయింది శ్రియ. స్నేహితులు తన బ్యాగ్ను ప్యాక్ చేస్తున్న స్టిల్ ను షేర్ చేసుకుంటూ ఇండియాకు తిరిగొస్తున్న విషయం చెప్పింది శ్రియ.
ఇండియా టికెట్తో ఓ సెల్ఫీ కూడా తీసుకుంది. బార్సిలోనాలో ఉంటున్నప్పటికి తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ తో మాత్రం టచ్ లోనే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ సెషన్ తో అందరితో మాట్లాడింది. ఇపుడు చాలా కాలం తర్వాత భారత్ కు వస్తుండటంతో ఎక్జయిటింగ్ కు లోనవుతుంది శ్రియ. ఈ భామ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీ రోల్లో కనిపించనుంది.
ఇవి కూడా చదవండి..
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్