హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఎల్లంపల్లితో పాటు దేవాదుల , సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు గోదావరి జలాలను ఎత్తిపోయాలని, గరిష్ఠస్థాయిలో వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి నీటిపారుదలశాఖపై సీఎం బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్షించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్ల్లో నీరు నిల్వ చేయడం లేదని, ఈ విషయంలో ఎన్డీఎస్ఏతో మరోసారి సంప్రదించాలని అధికారులకు సూచించారు.