భీమారం, జూలై 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తెలంగాణను నందనవనంలా మార్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా హన్మకొండ మండలం పలివేల్పుల గ్రామంలోని టీఎన్జీవోస్ ప్లాట్స్లో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్తో కలిసి శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం కడిపికొండలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హరితహారంలో టీఎన్జీవోస్ ఉద్యోగులు పాల్గొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. ఉద్యోగులకు కరోనా కష్ట కాలంలోనూ సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలు, విన్నపాలను రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోస్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు కష్టపడాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని మండల, జిల్లా స్థాయిలో విజయవంతం చేయాలన్నారు.
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పల్లె, పట్టణ ప్రగతి మంచి అవకాశమన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఉద్యోగులు హరితహారంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఉద్యోగి ఆరు మొక్కలు నాటి వాటికి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. ఈ నెల 24న ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొని జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఓరుగంటి అరుణకుమారి, దేవరకొండ అనిల్కుమార్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యదర్శి ఈ సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్, కోశాధికారి రాజేశ్, కేంద్ర సంఘం నాయకులు కోల రాజేశ్కుమార్, శ్యాంసుందర్, కత్తి రమేశ్, రాము నాయక్, లక్ష్మణరావు, అమ్జద్ అలీ, సారంగపాణి, రత్నాకర్ రెడ్డి, షఫీ, గజ్జ రామ్కిషన్, రవి పాల్గొన్నారు.