డిజిటల్ ప్లాట్ ఫాం (OTT platforms)లలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్ (Tollywood) నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమాలను 50 రోజుల (50 Day Window) తర్వాత ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు 50 రోజుల నిబంధన వర్తించనుంది.
చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా థియేట్రికల్ (Theatres) రిలీజ్కు ఓటీటీ విడుదలకు మధ్య గ్యాప్ తక్కువ ఉంటుండటంతో..థియేటర్లలో సినిమాలకు ప్రేక్షకాదరణ కరువయ్యే పరిస్థితి నెలకొన్న దని పలువురు అభిప్రాయపడ్డారు. సినిమాను తక్కువ టైంలోనే ఓటీటీ విడుదల చేయడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై 50 రోజుల నిబంధన అమలు చేసేలా ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇక తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే డిజిటల్ ప్లాట్ ఫాంలలోకి రానున్నాయి.