కథను నమ్ముకుని..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే హీరోలు కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో టాప్ ప్లేస్లో ఉంటాడు హీరో శర్వానంద్ (Sharwanand). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu) సినిమాలో మెరిశాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ హీరో అరుదైన మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో శర్వానంద్ ఫాలోవర్ల సంఖ్య మిలియన్ (10 లక్షలు)కు చేరుకుంది.
ఈ సందర్భంగా తన ఫాలోవర్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు శర్వానంద్. బ్లూ కుర్తాలో స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని, చేతిలో డ్రింక్ గ్లాస్ ఒకటి పట్టుకుని దిగిన స్టిల్ను ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేశాడు. తాజా లుక్లో శర్వానంద్ స్టన్నింగ్గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham)..(తమిళంలో కణం) షూటింగ్తో బిజీగా ఉన్నాడు.
మరోవైపు కృష్ణ చైతన్య డైరెక్షన్లో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ ప్రాజెక్టులో ప్రియమణి, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తుండగా..అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.