ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). కథా బలమున్న సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ పృథ్విరాజ్ సొంతం. ఈ స్టార్ హీరో ఇటీవలే తన తాజా చిత్రం కడువా ప్రమోషన్స్ లో భాగంగా వివేక్ ఒబెరాయ్, సంయుక్తా మీనన్ అండ్ టీంతో హైదరాబాద్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా తాను తెలుగు పాన్ ఇండియా సినిమా సలార్లో కీ రోల్లో నటిస్తున్నట్టు చెప్పాడు.
అంతేకాదు రాబోయే కాలంలో బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేసే ఆలోచన కూడా ఉందని చెప్పుకొచ్చాడు. త్వరలో తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయన్నాడు. కాగా ఈ మలయాళ స్టార్ హీరోకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పృథ్విరాజ్ త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నాడట. టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ లీడింగ్ బ్యానర్గా కొనసాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ (Malayalam industry)పృథ్విరాజ్తో సినిమాకు సైన్ చేయించుకున్నట్టు ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మైత్రీ మూవీ మేకర్స్ సీక్రెట్గా ఉంచినట్టు టాక్ నడుస్తోంది. ఈ టాప్ బ్యానర్ మలయాళ ఇండస్ట్రీ (Mythri Movie Makers)లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని, కోచిలో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటుకు ప్లాన్ కూడా చేస్తున్నారని రీసెంట్గా ఓ వార్త కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. మరి ఈ క్రేజీ న్యూస్ త్వరలోనే నిజం కానుందా..? అని తాజా అప్డేట్తో తెగ చర్చించుకుంటున్నారు సినీజనాలు.