టాలీవుడ్(Tollywood)లో పుకార్లు తెరపైకి రావడం సర్వసాధారణ విషయమే. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ పుకార్లకు ఎలాంటి లిమిట్స్ లేకుండా పోతుంది. కొన్ని రోజులుగా నెట్టింట్లో నానుతున్న విషయం టాలీవుడ్ సింగర్ కపుల్ హేమచంద్ర (Hema Chandra), శ్రావణ భార్గవి (Sravana Bhargavi) విడాకులు. ఈ ఇద్దరు దంపతులు త్వరలో విడాకులు (divorce) తీసుకునేందుకు సిద్దమవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ న్యూస్పై హేమచంద్రతోపాటు శ్రావణ భార్గవి కూడా క్లారిటీ ఇచ్చింది. అవసరం లేని, పనికిమాలిన సమాచారం తన పాటల కంటే తొందరగా వ్యాప్తి చెందుతుంది..అంటూ సతీమణి శ్రావణభార్గవిని ట్యాక్ చేశాడు హేమచంద్ర. మరోవైపు ప్రస్తుతం తన పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నానంటూ పోస్ట్ పెట్టింది శ్రావణ భార్గవి. హేమచంద్ర, శ్రావణ భార్గవి 2013లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి శికర చంద్రిక అనే పాప ఉంది.
ఈ ఇద్దరూ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉన్నామని చెప్తూ..పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశారు. ఈ ఇద్దరు సెలబ్రిటీ కపుల్ పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి.