టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కమెడీయన్గా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. అయితే ఇటీవల హీరోగాను రాణిస్తున్నాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ వంటి సినిమాలు చేశాడు. అంతేకాదు రెడ్డి హీరోగా నటించిన రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే కామెడీ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి ప్రేక్షకులని పలకరించనుండగా, ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.
వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు. నటుడు శ్రీనివాసరెడ్డి, కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేయగా, చాలా ఆసక్తికరంగా ఉంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబబ్బ నవ్విస్తున్నాయి. మీరు ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.