భారత దేశ గొప్ప దర్శకులలో శంకర్ కూడా ఒకరు. ఆయన సినిమాలలో యాక్షన్ తో పాటు సందేశం కూడా ఉంటుంది. శంకర్ ఇప్పుడు తెలుగు లో రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా శంకర్ తెరకెక్కించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. దిల్ రాజుకు ఈ చిత్రం 50 వ సినిమా కావడం విశేషం.
ఈ మూవీలో కథానాయిక పాత్ర కోసం మొదట సౌత్ కొరియన్ నటి సుజీ బేను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తర్వాత కియారా అద్వాని, అలియాభట్ లతో సహ పలువురి పేర్లు వినిపించినా.. హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు.
అయితే శంకర్ ఫైనల్ గా లోకల్ అమ్మాయిని తీసుకోవాలని భావించి రష్మికను పైనల్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. రష్మిక ఇటు ఉత్తరాదిలో అటు దక్షిణాదిలో వరుస సినిమాలతో జోష్ మీదుంది. క్షణం తీరిక లేకుండా షూటింగ్ ల్లో బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సిద్దార్ధ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో, తెలుగులో పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది రష్మిక.
కమల్ హసన్ నటించిన ఇండియన్ 2 సినిమా పూర్తి చేయకుండా శంకర్ మరే సినిమా చేయకుండా అడ్డుకోవాలని లైకా ప్రొడక్షన్స్ చేసిన విజ్ఞప్తిని మద్రాస్ హై కోర్టు తిరస్కరించింది. దీంతో శంకర్ కు కాస్త ఊరట లభించింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో సినిమాను కాస్త వేగంగానే తీయాలని ప్లాన్ వేస్తున్నారట. ఆగస్టులో షూటింగ్ ను మొదలు పెడుతున్న శంకర్-చరణ్ టీం ఇప్పుడు లొకేషన్లను వెతికే పనిలో ఉందట.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారులకు అండగా సోనూసూద్
ఎమోషనల్ అండ్ ఫన్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ట్రైలర్
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..