జబర్దస్త్, ఢీ, పటాస్ ప్రోగ్రామ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించింది వర్షిణి సౌందరాజన్. ఈ భామ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు శాకుంతలంలో కీ రోల్లో కనిపించనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సమ్మర్ లోనే వర్షిణి ఈ చిత్రంలో భాగస్వామ్యం అయింది. అంతేకాదు వర్షిణి తన పాత్రకు సంబంధించిన షూటింగ్ లో కూడా చేరిపోయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
పాన్ ఇండియా కథాంశంతో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో నటించే ఛాన్స్ రావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందంటోంది వర్షిణి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు వర్షిణి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ మరోవైపు రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న మళ్లీ మొదలైంది చిత్రంలో సుమంత్ భార్యగా నటిస్తోంది. రవితేజ, ప్రియమణి నటించిన శంబో శివ శంబో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
పీరియాడికల్ మూవీగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమవుతుంది.
ఇవి కూడా చదవండి..
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్