ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీని ఎన్టీఆర్కు జోడీగా ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్లో జోరుగా టాక్ నడుస్తోంది.
కొరటాల ఇప్పటికే భరత్ అనే నేను సినిమాతో కైరా అద్వానీని తెలుగు ఆడియెన్స్ పరిచయం చేశాడు. ఇపుడు మరోసారి కైరాను హీరోయిన్ గా ఒకే చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కైరా-ఎన్టీఆర్ జోడీ కన్ఫామ్ అయితే తప్పకుండా సినిమా ఓ రేంజ్ కు వెళ్లడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్