పెరిరా: కొలంబియాలో భూకంప(Colombia Earthquake) మృతుల సంఖ్య 250 దాటింది. సోమవారం 7.4 తీవ్రతతో ఆ దేశాన్ని భూకంపం షేక్ చేసిన విషయం తెలిసిందే. పెరిరా, కాలి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవంతులు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద ఇంకా వందల సంఖ్యలో జనం చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పర్వత ప్రాంతమైన పశ్చిమ కొలంబియాలో ప్రస్తుతం ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్లు, ఇండ్లు, స్కూళ్లు, హెల్త్ సెంటర్ల భవనాలన్నీ పగుళ్లు వచ్చాయి. వేర్వేరు నగరాల్లో నమోదు అయిన డేటా ప్రకారం ఇప్పటి వరకు 254 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
పెరిరా సిటీలో 101 మంది మరణించారు. కాలిలో మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్ సముద్రం దిశగా ఉన్న చాకో ప్రాంతంలోని స్థానిక తెగలకు ఇంకా విద్యుత్తు సరఫరా అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాఫీ తోటలన్నీ దెబ్బతిన్నట్లు సమాచారం ఉన్నది. దీంతో నేషనల్ కాఫీ ఫెడరేషన్.. గ్రామీణ కాఫీ తోటల వ్యక్తులతో టచ్లో ఉన్నది. నష్టాన్ని అంచనా వేస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని ఇంకా తొలగిస్తున్నారు.