తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత పెద్ద దిక్కుగా మారారు దర్శకరత్న దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా దాసరి తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, జర్నలిస్ట్గా, పొలిటీషియన్ గా తనదైన మార్కు చూపించారు. దాసరి అనారోగ్యంతో 2017 మే 30న తుదిశ్వాస విడిచారు. చాలా రోజుల తర్వాత దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా సినిమా రాబోతుంది.
సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యం ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతుండగా..ఇమేజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై టీ రమేశ్ నాయుడు నిర్మించనున్నారు. బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా..త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. పాపులర్ హీరో దాసరి నారాయణ రావు పాత్రలో కనిపించనున్నాడట. ఆ హీరో ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దాసరి గౌరవార్థం ప్రతీ యేటా దాసరి నారాయణ రావు ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతోపాటు టీ రమేశ్ నాయుడు దాసరి నారాయణ రావు మెమోరియల్ కల్చరల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై