సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రిపబ్లిక్. ఐశ్వర్య రాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. గానా ఆఫ్ రిపబ్లిక్ మ్యూజికల్ ఈవెంట్ను శనివారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు డైరెక్టర్ కొరటాల శివ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. సాయిధరమ్ తేజ్ ను చూసినప్పుడు తనకు ఎమోషనల్ కనెక్టివిటీ గుర్తొస్తుందన్నారు. తేజ్ విజయం సాధిస్తే నేను సంతోషంగా ఫీలవుతానని కొరటాల అన్నారు.
సినిమాలోని నా దేహంలో దాహం పాటలో ఫ్రీడమ్ కాన్సెప్ట్ (స్వేచ్చ భావన)ను చాలా బాగా చూపించారు. ప్రస్థానం సినిమా చూసిన తర్వాత దేవాకట్టా కథలకు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారని గ్రహించా. రిపబ్లిక్ స్టోరీ కూడా అంతకంటే మరింత ఆసక్తిగా ఇంటెన్స్ మ్యానర్ లో తెరకెక్కిస్తారని అనుకుంటున్నా.
మణిశర్మను మెలోడీ బ్రహ్మ అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది. నిర్మాతలు భగవాన్, పుల్లారావ్కు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు కొరటాల చెప్పారు. అయితే సాయిధరమ్ తేజ్తో కొరటాలకు ఆ ఎమోషనల్ బాండింగ్ ఏంటనేదానిపై క్లారిఫకేషన్ ఇవ్వకపోవడంతో ఫిలింనగర్ లో అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ గర్జనకు సిద్ధం కండి..క్రేజీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?