కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది. చిన్నపాటి షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. దీంతో కొరటాల శివ కొంత అప్ సెట్ అయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి రిలాక్సేషన్ లభిస్తుండటంతో షూటింగ్స్ కు లైన్ క్లియర్ అవుతుంది.
ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలని కొరటాలకు చిరు సూచించాడట. ఇంకా 15 రోజులు షూట్ మిగిలి ఉంది. రామ్ చరణ్ కు సంబంధించిన సీన్లు పూర్తయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. మరి చిరంజీవి సూచన మేరకు కొరటాల శివ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!