AP Cinema Tickets | చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సినిమా టికెట్స్ రేట్ల విషయంలో కానీ.. థియేటర్స్ విషయంలో కానీ జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిర్మాతలకు ససేమిరా నచ్చడం లేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టికెట్లు విక్రయించాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్టసవరణ బిల్లు-2021ను అసెంబ్లీ ఆమోదించింది. అంటే ఇకపై సినిమా టికెట్లలో సర్కారీ విధానం నడవనుంది అన్నమాట. ఏపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే సినిమా టికెటింగ్ వ్యవస్థ ఇకపై ముందుకు వెళ్లనుంది.
సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించడంతో టాలీవుడ్ పెద్దలకు భారీ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారు.. అంతేకాకుండా స్పెషల్ షోల పేరుతో టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారని.. ఇలాంటి వాటిపై నియంత్రణ తీసుకురావడానికే చట్టంలో మార్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది శరాఘాతంలా మారనుంది. టికెట్ల విక్రయం కోసం ఇండియన్ రైల్వేస్ వినియోగిస్తున్న ఐఆర్సీటీసీ తరహాలోనే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు నిర్మాతలు వచ్చి ఈ పద్ధతి కావాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు అని పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆన్లైన్ మూవీ టికెట్ బుకింగ్ విధానం అందరికీ అందుబాటులో, సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి తెలిపారు. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు తమకు నచ్చిన సినిమా టికెట్లు బుక్ చేసుకునే అవకాశమున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు సినిమా హాళ్ల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే సమయాన్ని ఆదా చేయడానికి ఈ ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానం వల్ల ముఖ్యంగా బ్లాక్ టికెట్స్ దందాకు చెక్ పడనుంది. అలాగే ప్రభుత్వానికి పన్ను ఎగవేసేవారి సంఖ్యను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిర్ణీత గడువులోగా జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వంటి పన్నులను వసూలు చేయడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.
ఏదేమైనా ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ కావడంతో రాబోయే పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై సినిమా పెద్దలతో ప్రభుత్వం పలుసార్లు చర్చించింది. ఈ నేపథ్యంలోనే దశల వారీగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపిన ఏపీ ప్రభుత్వం అందరూ అంగీకరించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. వెబ్సైట్ ద్వారా టికెట్లు విక్రయించనున్న ప్రభుత్వం.. నిర్మాతలు, థియేటర్ల యజమానులకు సంబంధిత నగదును నేరుగా వారి ఖాతాలకు జమ చేయనుంది. మరి ఈ కొత్త బిల్లుతో ఏపీలో కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఏపీలో టికెట్స్ ధరల ఎఫెక్ట్.. భీమ్లా నాయక్ సినిమాకు తప్పని కష్టాలు..
RRR నిర్మాతలకు ఊహించని షాక్.. వందల కోట్లు వచ్చేదెలా..?
Goddess Tamannaah | దేవతలా మారిపోయిన తమన్నా..అరటాకులో భోజనం
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Jayasudha: జయసుధ మొహం ఇలా అయిపోయిందేంటి?
Rashmika: విజయ్ దేవరకొండని కలిసేందుకు యూఎస్ వెళుతున్నావా రష్మిక..!