ap movie ticket | ఈ రోజుల్లో భారీ సినిమా విడుదల అయింది అంటే మొదటి మూడు రోజులు కలెక్షన్స్ ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకుడు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు కలిసి నటించిన సినిమాకు వచ్చే వసూళ్ల గురించి కలలో కూడా ఊహించలేరు.. బాక్సాఫీస్ బద్దలు అయిపోతుంది. టికెట్ రేట్ 500 కాదు 1000 రూపాయలు అయినా తీసుకుంటారు అభిమానులు. ఇన్ని రోజులు ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మాతలు ఇదే ధైర్యంతో ఉన్నారు. ఎన్ని వందల కోట్ల బిజినెస్ చేసినా కూడా సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా బయటపడిపోతాం అనే నమ్మకం వాళ్లకు ఉండేది. పైగా బెనిఫిట్ షోలు, తొలి మూడు రోజులు టికెట్ రేట్స్ పెంచుకోవడం ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి. అయితే ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ట్రిపుల్ ఆర్ నిర్మాతలకు షాక్ తగిలింది.
ట్రిపుల్ ఆర్ నిర్మాతలే స్వయంగా వెళ్లి జగన్ను కలిసి టికెట్ల రేటు పెంచుకోవడానికి అనుమతి అడుగుదాం అనుకుంటున్న తరుణంలో సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అంటే ఇకపై కేవలం ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మాత్రమే టికెట్లు విక్రయించాలి అనేది ఇందులోని ప్రధాన సిద్ధాంతం. ఈ లెక్కన ట్రిపుల్ ఆర్ సినిమా మామూలు టికెట్ రేట్లతోనే విడుదల కానుంది. సినిమాకు పెట్టిన బడ్జెట్ దృష్ట్యా 30, 50, 70, 100 రూపాయల టికెట్లతో ఎన్ని కోట్లు వస్తాయి అనేది వాళ్లకు అర్థం కావడం లేదు.. అంతుచిక్కడం లేదు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కానుంది. ఏపీ ప్రభుత్వంతో మరోసారి చర్చలు చేయాల్సిన అవసరం లేకుండా సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లు ఆమోదించారు. మరి ఇది ఎలాంటి పరిణామాలు తీసుకువస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెద్ద సినిమాలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థకు ఓటు..
NTR: నాటు నాటు సాంగ్ కోసం అన్ని టేకులు తీసుకున్నారా..!
Pawan Kalyan: ఎన్టీఆర్ షోలో మహేష్తో పాటు పవన్ కూడా సందడి చేయనున్నాడా..!
ఏపీలో టికెట్స్ ధరల ఎఫెక్ట్.. భీమ్లా నాయక్ సినిమాకు తప్పని కష్టాలు..