ఎన్టీఆర్ హోస్ట్గా ప్రసారం అవుతున్న క్విజ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎన్టీఆర్కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు. హాట్ సీట్లో కూర్చున్న మహేష్ని ఎన్టీఆర్ ఎలాంటి ప్రశ్నలు వేస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో మహేష్కి విచిత్ర ప్రశ్నలు వేసినట్టు అర్ధమైంది.
మహేష్ చెప్పిన సమాధానాన్ని ఎన్టీఆర్ అటు తిప్పి ఇటు తిప్పి తికమక పెట్టేందుకు ప్రయత్నించడంతో, నీ కంటే మీ గురువు (కంప్యూటర్) గారే నయం అంటూ ఎన్టీఆర్పై మహేష్ బాబు క్రేజీ కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది. తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నారట. “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఫ్రెండ్ లైఫ్ లైన్ అనే ఆప్షన్ లో భాగంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో వీడియో కాల్ మాట్లాడతాడని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే షో పీక్స్కి వెళ్లడం ఖాయం అంటున్నారు.
అంతకుముందు ఈ షోకు రామ్ చరణ్, సమంత, రాజమౌళి, కొరటాల శివ, థమన్, దేవి శ్రీ ప్రసాద్ వచ్చి హాట్ సీట్లో కూర్చొని సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ మేర అట్రాక్ట్ చేస్తాడు? ఎంత సొమ్ము గెలుచుకుంటాడు? అనేది టోటల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక చూడాల్సిందే.