Rashmi Gautam | హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల (street dogs) దాడిలో అయిదేండ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam) తాజాగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
‘అవును.. దురదృష్టవశాత్తు తన తప్పు లేకుండానే వీధి కుక్కల (street dogs) దాడిలో (Attack) ఆ చిన్నారి చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీధి కుక్కల బర్త్ కంట్రోల్కు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. అంతేకాదు వాటికి సరైన వసతి కల్పించడం లాంటివి చేయాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణులు’ అంటూ రష్మి రాసుకొచ్చింది.
Unfortunately yes the little boy did die for no fault of his and a long term solution of birth control,vaccination and shelter shud be implemented
Animals are territorial just like us they need there own space https://t.co/GTZ1UhRlCN— rashmi gautam (@rashmigautam27) February 21, 2023
రష్మికి కుక్కలంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వీధి కుక్కలకి ఆహారం అందించి తన మంచి మనస్సుని చాటుకుంది. అయితే, బాలుడి మృతిపై రష్మి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు రష్మికి సపోర్టు చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 19వ తేదీన జరిగిన ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలానికి చెందిన గంగాధర్ తన కుటుంబంతో హైదరాబాద్కు వలస వచ్చాడు. ఛే నంబర్ ఛౌరస్తాలో కారు సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తున్న అతను ఆదివారం తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్కు తీసుకువెళ్లాడు. గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ ఆడుకునేందుకు వీధిలోకి వెళ్లాడు. దీంతో అక్కడున్న వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్(minister ktr) కూడా స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటన చాలా విషాదకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also..
Alia Bhatt | ఆలియా ఇంటిపై కెమెరాతో నిఘా.. వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా..? అంటూ నటి ఫైర్
Pawan Kalyan | మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మామాఅల్లుళ్ల మల్టీస్టారర్ మొదలైంది!
Anushka Shetty | అనుష్క శెట్టి షాకింగ్ లుక్.. బరువు తగ్గకపోవడానికి కారణమేంటి..?
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడి మృతి